మాజీ ప్రధానికి మోదీ నివాళులు

May 21, 2015 | 03:02 PM | 38 Views
ప్రింట్ కామెంట్
pm_modi_tribute_to_rajeev_gandhi_niharonline

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్థంతి సందర్భంగా దేశ ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ ఔనత్యం కోసం చాలా కృషి చేశారని, తన ప్రాణాలను సైతం కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తమ నేత వర్థంతిని నిర్వహించి నివాళులర్పించింది. ఢిల్లీ లోని స్మారక సమాధి వీర్ భూమి వద్ద ఆయన సతీమణి సోనియా గాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంకలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ