స్వదేశానికి బయలుదేరిన మోదీ

May 19, 2015 | 05:40 PM | 22 Views
ప్రింట్ కామెంట్
modi_returns_to_india_from_seoul_niharonline.jpg

భారత ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన ముగిసింది. మొదట చైనా, తర్వాత మంగోలియా, ఆ తర్వాత దక్షిణ కొరియాల్లో పర్యటించిన మోదీ, తన పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా మోదీకి సియోల్ లో ఘనంగా వీడ్కోలు పలికారు. తన పర్యటన సందర్భంగా మూడు దేశాలతో పలు అంశాలపై మోదీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ