ఆరాధించాలంటే... ఆశయాన్ని నేరవేర్చండి చాలు

February 12, 2015 | 10:50 AM | 79 Views
ప్రింట్ కామెంట్
modi_shocked_over_his_temple_niharonline

గుజరాత్ లో తన పేరిట గుడి కట్టిన అంశంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ విస్మయం వ్యక్తంచేశారు. ‘‘నా పేరున గుడి కట్టిన విషయం నన్ను ఆవేదనకు గురిచేసింది. ఇది భారత సమున్నత సంప్రదాయానికి విరుద్ధం. ఇదా మన సంస్క్రుతి మనకు నేర్పింది? ఈ విషయం వ్యక్తిగతంగా నన్ను కలచివేసింది. ఇలాంటి తప్పులను మళ్లీ పునరావ్రుతం చేయకండి. మీకు సమయం ఉంటే స్వచ్ఛ్ భారత్ లో పాల్గొని నా ఆశయాన్ని నేరవేర్చండే తప్ప దయచేసి ఇలాంటి పనులు చేయకండి’’ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. గుజరాత్ లో బతికి ఉన్న ఓ మనిషికి గుడి కట్టడం ఇదే ప్రథమం అని ఓమ్ యువ గ్రూప్ నేత జాయేష్ పటేల్ తెలిపాడు. దాదాపు 350 మందితో ఉన్న మా సంఘం మోదీకి వీరాభిమానులం. ఆయన మొదటి సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయినప్పటి నుంచే ఆయనను దేవుడిలా ఆరాధిస్తున్నాం. ఇకపై ఈ ఆలయంలో మోదీకి పూజలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. కొతారియా రోడ్ లో నెలకొల్పిన ఈ దేవాలయాన్ని ఫిబ్రవరి 16న ఆవిష్కరించేందుకు మోదీ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్రామం పేరుకు గుజరాత్ లోనే ఉన్నప్పటికీ ఢిల్లీ లోని రాజ్ కోట్ పరిధిలోకి వస్తుంది. విమర్శలు వస్తాయని ముందుగా అనుకున్నారేమో ఢిల్లీ ఓటమికి ఈ ఆలయానికి ఏమాత్రం సబంధం లేదని వారు ముందే చెప్పేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ