మోదీ-రాహుల్ చేతులు కలిపారు

December 11, 2015 | 10:48 AM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-shake-hand-rahul-gandhi-at-pawar-birthday-niharonline

నిరంతరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే వైరి వర్గాలు ఒకే వేదికపై కూర్చుంటే ఎలా ఉంటుంది. ఆత్మీయంగా ఒకరినోకరు పలకరించుకుని ముచ్చటించుకుంటే చూడటానికి సంబరంగా ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి సీన్లే గురువారం ఢిల్లీలో చోటుచేసుకున్నాయి. రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జన్మదినం సందర్భంగా రాజకీయ అతిరథమహరథులంతా హాజరయ్యారు. అక్కడే మనమెప్పుడూ చూడలేమనుకున్న దృశ్యాలు కూడా ఈ వేదికపై కనిపించాయి.

వేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీలతో కలిసి కూర్చున్నారు.

ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నిష్క్రమిస్తున్న సందర్భంగా అందరినీ పేరు పేరునా పలుకరించిన మోదీ రాహుల్ తో ఏకంగా చేయి కలిపారు. ముందు తన వద్దకు వచ్చిన మోదీకి రెండు చేతులు జోడించి మరీ రాహుల్ గాంధీ నమస్కరించారు. అయితే మోదీ మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక అంతకుముందు తన సీటుకు రెండు సీట్ల ఆవల ఉన్న మన్మోహన్ సింగ్ ను పలకరించేందుకు అక్కడి దాకా వెళ్లిన మోదీ, ఆ పక్కనే ఉన్న సోనియా గాంధీ వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ