సీనియర్ ఎంపీ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని

June 24, 2015 | 05:36 PM | 2 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_condolence_bhuria_niharonline

భాజపా సీనియర్ ఎంపీ దిలీప్ సింగ్ భూరియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతిచెందారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించిన భూరియాను కోల్పోవడం పార్టీకి తీరని లోటని మోదీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ఎంపీ భూరియా మృతితో ఆయన కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ