బ్రిటన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

November 12, 2015 | 10:43 AM | 1 Views
ప్రింట్ కామెంట్
PM-narendra-modi-leaves-for-UK-niharonline

మూడు రోజుల పర్యటన కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితం ఆయన ఎయిర్ ఇండియా విమానంలో విదేశీ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన బ్రిటన్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. మేకిన్ ఇండియాను విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో బ్రిటన్ తో ఆయన పలు ఒప్పందాలను కూడా కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా జీ20 సదస్సులోనూ ప్రధాని పాల్గొంటారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ