పాక్ సడన్ విజిట్ పై విపక్షాలు తిడితేనేం...

December 26, 2015 | 12:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
US_UN_chief_welcome_PM_Modi_surprise_Pak_visit_Niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ఆకస్మిక పర్యటనపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా, ప్రపంచ దేశాల నుంచి మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అప్ఘనిస్థాన్ నుంచి నేరుగా పాకిస్థాన్ నగరం లాహోర్ లో పర్యటించిన మోదీ షరీఫ్ ఇంట వివాహ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. అంతేకాదు అక్కడ షరీఫ్ తల్లికి ఆయన పాదాభివందనం చేశారు. అనంతరం నవాజ్ షరీఫ్ ఇచ్చిన ఆతిథ్యంపై ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశాడు. ఈ వైనంపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది.

కేవలం గంటల వ్యవధిలో మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం భారత్, పాక్ ల మధ్య సత్సంబంధాలకు దోహదం చేయనుందని ఆ దేశం పేర్కొంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దక్షిణాసియా రూపురేఖలనే మార్చివేయనున్నాయని ఈ సందర్భంగా అమెరికా అభిప్రాయపడింది. మరోవైపు మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య ఆశ్చర్యకర రీతిలో జరిగిన భేటీ పట్ల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హర్షం సంతోషం తెలిపారు. ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ తరహా భేటీలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ