అగ్రరాజ్యంతో మైత్రి మరింత బలపడాలని ఆశిస్తు...

July 04, 2015 | 05:30 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi_wishes_america_independence_day_niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (జూలై 4) అమెరికా స్వాతంత్ర్య దినం సందర్భంగా  ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడాలని, ఆర్థిక వ్యవస్థతోపాటు మరిన్ని రంగాల్లో పరస్పరం దోహదం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గతేడాది నేను అమెరికా వెళ్లాను, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆ దేశ అధ్యక్షుడు (ఒబామా) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విధంగా పరస్పర పర్యటనలతో బంధం మరింత బలపడింది. పెద్దదేశాలైన ఈ రెండిటి మైత్రి ఇరుదేశాలకే కాదు, ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మైత్రి భవిష్యత్ లో మరింత బలపడాలని కొరుకుంటున్నా అని మోదీ అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ