ప్రధానికి రొంబ థాంక్స్

January 09, 2016 | 11:51 AM | 1 Views
ప్రింట్ కామెంట్
jayalalitha-thanks-to-modi-for-jallikattu-niharonline

సంక్రాంతి సందర్భంగా తమిళనాడు ప్రజలకు కేంద్రం కానుక ఇచ్చిన విషయం తెలిసిందే. తరతరాలుగా వస్తున్న జల్లికట్టును తిరిగి నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జంతు ప్రేమికుల అభ్యంతరాలను పక్కనబెట్టిన నరేంద్ర మోదీ సర్కారు సంప్రదాయానికే ఓటేసింది. అంతేకాక ఈ విషయంపై అందిన వినతుల పరిశీలనను సుదీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టకుండా ఒక్క నిమిషంలో తేల్చేసింది. కేంద్రం తక్షణ స్పందనకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫిదా అయిపోయారు. వెంటనే ప్రధానికి రొంబ (చాలా) థ్యాంక్స్ చెప్పారు.

                    నాన్చుడు ధోరణిలో కాకుండా తక్షణం స్పందించారని ఆమె ప్రధానికి థ్యాంక్స్ చెబుతూ ఓ లేఖ రాశారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్న తమ భావనకు మద్దతిచ్చారని కూడా ఆమె మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. పనిలో పనిగా ఈ విషయంలో కేంద్రం నుంచి తక్షణ స్పందన వచ్చేలా వ్యవహరించిన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కృషిని కూడా జయలలిత ఆ లేఖలో ప్రస్తావించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ