రాజమండ్రి ఘటన పై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

July 14, 2015 | 04:11 PM | 19 Views
ప్రింట్ కామెంట్
Narendra_Modi_godavari_rajamaundry_incident_niharonline

గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈరోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 25 మంది బలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవటం తనకెంతో బాధ కలిగించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.కేంద్రం తరపున కూడా అవసరమైన సహయం అందిస్తామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ