హ్యాట్రిక్ గెలుపుపై ట్విట్టర్లో సంబరాలు

August 25, 2015 | 04:07 PM | 4 Views
ప్రింట్ కామెంట్
modi_thanks_over_karnataka_poll_win_niharonline

సందర్భం, సంబరం ఏదైనా తేడా లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ను భలే వాడుకుంటున్నారు. ఈరోజు బెంగళూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సంబరాలు జరుపుకున్నారు. బీజేపీని నమ్మి విజయాన్ని కానుకగా అందించిన బెంగళూరు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కన్నడ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పిన ఆయన, కర్ణాటక బీజేపీ నేతలకు, బీబీఎంపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో విజయం అనంతరం, బెంగళూరు ఫలితాలు బీజేపీకి హ్యాట్రిక్ గెలుపును అందించాయని, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అభివర్ణించారు. బీజేపీపై ప్రజల నమ్మకం ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైందని, దేశంలో 125 కోట్ల మంది ప్రజల కోరికలు తీర్చేందుకు తాము ప్రయత్నిస్తామని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ