ప్రభు రైల్వే బడ్జెట్ భేష్!

February 25, 2016 | 04:18 PM | 1 Views
ప్రింట్ కామెంట్
narendra-modi-suresh-prabhu-niharonline

వరుసగా రెండోసారి రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం మోదీ ట్విట్టర్ లో ప్రభును పొగడ్తలతో ముంచెత్తారు.

                                        'గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లను విమర్శించదలచుకోలేదు. ఈ బడ్జెట్ వ్యయం రెండున్నర రెట్లు పెరిగింది. దేశ పురోభివృద్ధికి దోహదపడుతుంది. దేశాభివృద్ధిలో దీర్ఘకాలం ప్రభావం చూపుతుంది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులకు ఊరట కలిగించారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా పురోగతి కనిపించింది. ఈ బడ్జెట్ వల్ల మరింత అభివృద్ధి జరుగుతుంది. దేశాభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు. ప్రభుతోపాటు బడ్జెట్ తయారు చేయడానికి అహర్నిశలు శ్రమించిన సిబ్బందికి కూడా మోదీ కృతజ్నతలు తెలియజేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ