ఉజ్బెకిస్థాన్ లో ఎన్నారైలతో మోదీ ముఖాముఖి

July 07, 2015 | 12:34 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi_in_tashkent_with_nri_niharonline

విదేశీ పర్యటనలో భాగంగా ఉబ్జెకిస్థాన్ లో ఉన్న మోదీ రాజధాని తాష్కెంట్ లో మంగళవారం అక్కడి భారతీయులతో భేటీ అయ్యారు. ఎన్నారైలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన భారతీయ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ భారతీయ సినిమాలు, సంగీతానికి ఎనలేని ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. మనిషి వికాసంలో భాష కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భాష అన్ని ప్రాంతాలు, సంప్రదాయాలను కలుపుతుందన్నారు. 50 ఏళ్లుగా ఇక్కడి రేడియోల ద్వారా హిందీలో ప్రసారాలు జరగటం గొప్ప విషయమని, ఇది తమకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. మనిషి హింసా మార్గం వైపు వెళ్లకుండా సంగీతం తొడ్పడుతుందన్నారు. ఆందోళనల నుంచి విముక్తికి, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం మంచి మార్గమని ప్రధాని సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ