ఆరోజు ప్రధాని మోదీ సరికొత్త అవతారం?

June 03, 2015 | 02:19 PM | 5 Views
ప్రింట్ కామెంట్
modi_as_yoga_guru_on_yoga_day_niharonline

ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మోదీకి యోగాసనాలపై ఆసక్తి ఎక్కువే. గుజరాత్ సీఎంగానే కాక పీఎం పీఠమెక్కినా, ఆయన ప్రతిరోజూ తెల్లవారు జామున యోగాసనాలు వేస్తూనే ఉన్నారు. అంతేకాదండోయ్, వీలు చిక్కితే యోగా పాఠాలు చెప్పేందుకూ ఎంతమాత్రం సంకోచించరు. ఇక ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ తప్పకుండా యోగాసనాలు వేయాలని తద్వారా పనితీరు మెరుగుపడుతుందని అధికారిక ఉత్తర్వుల ద్వారా సూచించారు. తాజాగా ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇంకేం ఇక ఆరోజు యోగా గురువు అవతారం ఎత్తేందుకు మోదీ సిద్ధమైపోతున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ