సింఘాల్ మృతి వ్యక్తిగతంగా తీరని లోటు

November 18, 2015 | 12:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-pays-tribute-to-ashok-singhal-death-niharonline

అశోక్‌ సింఘాల్‌ మృతి దేశానికి తీరనిలోటు అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సింఘాల్‌ మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ సేవ కోసమే సింఘాల్‌ జీవితాన్ని ధార పోశారని కొనియాడారు. సింఘాల్‌ ఎల్లప్పుడూ తనకు మార్గదర్శనం చేస్తుండేవారని గుర్తుచేస్తుకున్నారు. అశోక్‌సింఘాల్‌ ఓ వ్యక్తి కాదు... శక్తి అని తెలిపారు. కొన్ని తరాలకు అశోక్‌సింఘాల్‌ స్ఫూర్తిగా నిలుస్తారని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ సింఘాల్ మంగళవారం మధ్యాహ్నం 2:24 గంటలకు గుర్‌గావ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ