సభా సమయం వృథా చేయం

February 23, 2016 | 05:39 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi says parliament budget session will be fruitful niharonline

బడ్జెట్ సమావేశాలపై కోట్లాది మంది దేశ ప్రజలు దృష్టి పెట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న రీతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్షాలతో సభా వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించామని, అన్ని పార్టీలు సభకు సహకరిస్తాయన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. సభా సమయం సద్వినియోగం అవుతుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల సమస్యలను చర్చిస్తామని, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు’’ మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ