మలేషియా, సింగపూర్ పర్యటన ఎందుకు?

November 19, 2015 | 11:30 AM | 2 Views
ప్రింట్ కామెంట్
india_PM_narendra_modi_malaysia_singapore_key_regional_talk_tour_niharonline

బ్రిటన్ పర్యటన ముగించుకుని ఇలా వచ్చారో లేదో మరో విదేశీ పర్యటన కోసం భారత ప్రధాని సిద్ధమైపోయారు. ఈసారి ఆయన ప్రయాణం మలేషియా, సింగపూర్ దేశాలకు. 13వ ఆసియాన్ - ఇండియా సదస్సులో, 10వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఆయన పాల్గొనేందుకట. విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాధ్వా మోదీ పర్యటన విషయాలను మీడియాకు తెలిపారు.

21న కౌలాలంపూర్ చేరుకునే ప్రధాని, ఆ దేశ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్టు వివరించారు. ఈ రెండు సదస్సులూ మలేషియా ప్రధాని మహమ్మద్ నజీబ్ బిన్ తున్ హాజీ అబ్దుల్ రజాక్ అధ్యక్షతన జరగనున్నాయని, ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) అధినేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారని వివరించారు. భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే దిశగా ఇక్కడ చర్చలు జరగనున్నాయని తెలిపారు. సదస్సు అనంతరం, కౌలాలంపూర్ డిక్లరేషన్, ఈఏఎస్ డిక్లరేషన్, ఉగ్రవాదంపై ఈస్ట్ ఆసియా దేశాల స్టేట్ మెంట్, భద్రత, సమాచార సాంకేతికతపై స్టేట్ మెంట్లు విడుదలవుతాయని వాధ్వా పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ