అణు శక్తి కోసం మోదీ మూడురోజుల పర్యటన

April 09, 2015 | 12:57 PM | 66 Views
ప్రింట్ కామెంట్
modi_canada_tour_for_nucleasr_power_niharonline

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున న్యూక్లియర్ రియాక్టర్లు, అణు ఇంధనం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో మూడు రోజుల ఫ్రాన్స్, కెనడా దేశాల పర్యటనకు నేడు బయలుదేరి వెళ్లనున్నారు. ముందుగా రెండు రియాక్టర్ల నిర్మాణానికి ఫ్రాన్స్ అధికారులతో ప్రధాని బేరసారాలు నడుపనున్నారు. ఈనెల 11 వరకు జరిగే పర్యటనలో భారత అణుశక్తి మరింత మెరుగుపడేలా నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నత్తనడకన సాగిన అణుశక్తి ప్రాజెక్టులు, మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ద్వారా పరుగులు పెడతాయని భావిస్తున్నట్లు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అటు సాంకేతికతతోపాటు, వాణిజ్య పరమైన అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయని ఆయన తెలిపారు. క్లీన్ ఎనర్జీ దిశగా అణు ఇంధనం కీలకమని భావిస్తున్న మోదీ, భారత్ కు అణు పరిజ్ణానాన్ని ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్న అగ్రరాజ్యాలపై ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ