మంత్రులకు మోదీ సాలిడ్ వార్నింగ్

April 04, 2015 | 11:15 AM | 141 Views
ప్రింట్ కామెంట్
modi_warns_ministers_niharonline

బాధ్యతారాహిత్యంతో కూడిన కామెంట్లు చేస్తూ, పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు ప్రధాని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. బెంగళూరులో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన మోదీ, అమిత్ షాలు ఈ మేరకు నేతలతో చర్చించారట. అభ్యంతరకరంగా, బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని వారు స్పష్టంచేశారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన జాతి విద్వేష వ్యాఖ్యలు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికిప్పుడు బీజేపీ నేతలను కట్టడి చేయటం కష్టమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ