లంక ప్రజలకు మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

February 04, 2015 | 02:57 PM | 39 Views
ప్రింట్ కామెంట్

శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మన చారిత్రక బంధాలు, సంస్క్రుతి, ఉమ్మడి విలువలు ఎప్పటికీ చెరిగిపోనివి’’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రానున్న ఏళ్లలో శ్రీలంక పురోగామి పథంలో పయనించాలని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కొత్త అధ్యక్షుడు సిరిసేన రాక కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ ప్రకటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సిరిసేన ఈ నెల 16న భారత్ కు రానున్న విషయం విదితమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ