చైనా ప్రధానితో కీలక ఒప్పందాలపై సంతకం

May 15, 2015 | 11:39 AM | 37 Views
ప్రింట్ కామెంట్
modi_li_keqauiang_niharonline.jpg

భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన రెండో రోజుకు చేరుకుంది. గురువారం అంతా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయన సొంత పట్టణంలో బిజీగా గడిపిన మోదీ... శుక్రవారం కార్యరంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ తో ఆయన భేటీ అయ్యారు. అత్యంత కీలక సమస్యలైన సరిహద్దు ప్రాంత వ్యవహారంతోపాటు భారత్ లో పెట్టుబడులపై మన ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. రేపు చైనాలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. అంతేకాకుండా చైనాలో ఉన్న భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ