ధవళేశ్వరం ప్రమాదంపై పీఎం దిగ్భ్రాంతి

June 13, 2015 | 12:31 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modhi_sad_pic_niharonline

తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజీపై నిన్న రాత్రి జరిగిన ప్రమాదాన్ని గురించి ప్రధాన మంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 22 మంది అక్కడికక్కడే మరణించగా, చికిత్స కోసం తరలిస్తున్న మరో బాలిక కూడా మృతి చెందింది. పదమూడేళ్ళ వయసున్న ఈగ కిరణ్ అనే బాలుకు ఒక్కడు ఈ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోది విచారకం వ్యక్తం చేశారు. ‘ధవళేశ్వరం దుర్ఘటన చాలా బాధాకరం’’ అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ