పొరుగు ప్రధానులకు మోదీ రంజాన్ విషెస్

June 17, 2015 | 01:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_wishes_ramzan_to_pakisthan_bangladesh_niharonline

రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా దేశ ప్రధాని మోదీ పొరుగు దేశాల ప్రధానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఫోన్ చేసిన మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనతోపాటు ఆప్ఘనిస్థాన్ రాష్ట్రపతి మహ్మద్ అష్రఫ్ ఘనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారికి స్వయంగా వారికి ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. పాక్ ప్రధానితో ఫోన్ లో భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ మాట్లాడారట. అంతేగాక భారత్ అరెస్టు చేసిన పాక్ మత్స్యకారులను రంజాన్ సందర్భంగా విడుదల చేస్తామని హామీనిచ్చినట్లు తెలిసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ