మావోయిస్టులకు మోదీ సీిరియస్ వార్నింగ్

May 09, 2015 | 05:39 PM | 42 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_warns_to_maoists_in_chattisgarh_niharonline

ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో పర్యటిస్తున్న మోదీ మావోయిస్టులపై విరుచుకుపడ్డారు. దేశంలోని మావోయిస్టులను ఏరిపారేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మావోల ప్రభావం తీవ్రంగా ఉన్న దంతెవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న మావోయిస్టులను ఏరిపారేస్తానని మోదీ అన్నారు.  హింసకు భవిష్యత్తు లేదన్న మోదీ, శాంతికి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మావోయిస్టుల సమస్యతో సతమతమవుతున్న ఛత్తీస్ గఢ్ ప్రజలు ఎంతమాత్రం నిరాశ చెందాల్సిన పనిలేదని చెప్పిన ఆయన. మావోయిస్టులపై పోరు సాగిస్తామని ప్రకటించారు. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు మురికివాడల్లో నివసించాలని కోరుకోరని, అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాల్సిన గురుతర బాధ్యతలను తమ ప్రభుత్వం తీసుకుందని మోదీ ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ