ప్రధానితో భేటీకి సీఈవోలు క్యూ కడుతున్నారు

September 02, 2015 | 03:23 PM | 4 Views
ప్రింట్ కామెంట్
sunder-pichai-meet-modi-in-US-tour-niharonline.jpg

మహా మహా నేతల కూడా రానీ పాపులారిటీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తక్కువ కాలంలోనే వచ్చేసింది. అగ్రరాజ్యాల అధినేతలు, వీవీఐపీలు సైతం మోదీని కలిసేందుకు, కరచలనం చేసేందుకు ఎగబడిపోతున్నారంటే ఆయన క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత ప్రధాని త్వరలో అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లు మోదీని కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడిపోతున్నారట. ఆ లిస్ట్ చాలా పెద్దగానే ఉందని వారు చెబుతున్నారు.  శాన్ జోష్ లోని శాప్ సెంటర్ లో నిర్వహించనున్న సమావేశానికి మోదీ ప్రసంగం వినేందుకు టికెట్లన్నీ ఇప్పటికే బుక్కయ్యాయట. అంతేకాదు అక్కడ గూగుల్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్ ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారట. ఆయనతోపాటు అబోడ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారయణ్, శాన్ డిస్క్ సీఈవో సంజయ్ మల్హోత్రా కూడా మోదీ తో సమావేశం కానున్నారట. వీరితోపాటు యూస్ బిజినెస్ రంగంలో రాణిస్తున్న పలువురు భారతీయ సంతతి వ్యక్తులు కూడా ప్రధానిని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ