అమితాబ్, షారూఖ్, కత్రినా సరసన కేజ్రీవాల్

March 24, 2016 | 11:57 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Kejriwal-Madame-Tussauds-niharonline

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం పడనీయకుండా అఖండ మెజార్టీతో ఢిల్లీ పీఠంపై అడుగుపెట్టాడు అరవింద్ కేజ్రీవాల్. మొదటిసారి ఎంపికైనప్పుడే మొండిపట్టుదలతో రాజీనామా చేసిన ఆయన రెండోసారి ఎంపికవటం కష్టం అనుకున్న సమయంలో ఆశ్చర్యకరరీతిలో విజయం సాధించాడు. అలాంటి సామాన్య నేతకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.

                లండన్ లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రముఖులకు సంబంధించిన మైనపు విగ్రహాలను మాత్రమే మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం లో ఏర్పాటు చేస్తారు. ‘తుస్సాడ్స్’ కు సింగపూర్, హాంగ్ కాంగ్, బ్యాంకాక్ లో బ్రాంచ్ లు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ మ్యూజియం కొత్త బ్రాంచ్ ను మన దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

                  ఈ మ్యూజియంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ అంగీకరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసే నిమిత్తం కొలతలు తీసుకునేందుకు వచ్చే నెలలో సంబంధిత అధికారులు రానున్నారని, అందుకు కేజ్రీవాల్ అంగీకరించారని సమాచారం. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఏర్పాటు నిమిత్తం ‘తుస్సాడ్స్’ అధికారులు ఆయన కొలతలు తీసుకువెళ్లారు. ఇప్పటివరకు ఈ మ్యూజియంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ల విగ్రహాలను ఇదివరకే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ