పెద్దాయన దీవెనలు తనకేనంటున్న అరవింద్

February 04, 2015 | 05:21 PM | 46 Views
ప్రింట్ కామెంట్

ఎవరెన్నీ విమర్శలు చేసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తనదే విజయమని ఢంకా బజాయించి చెబుతున్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. లేనిపోని ఆరోపణలు చేసి బీజేపీ జనాల్లో చులకన అయిపోతుందని ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన చెప్పారు. అంతేకాదు తాను గురువులా భావించే ప్రముఖ గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వ్యక్తిగతంగా దీవెనలు అందించాడని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి సమర్థవంతమైన పాలన ఒక్క ఆప్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు. కాగా, అన్నాహజారే 2011 లో చేపట్టిన వ్యతిరేక ఉద్యమంలో ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోపాటు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ పాలనపై సానుకూలతతో లేని అన్నా హజారే తన మద్థతును కేజ్రీవాల్ కే ఇస్తున్నట్లు పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అరవింద్ వ్యాఖ్యలతో ఆ విషయం తేటతెల్లమైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ