వింత విమర్శ: తిరుపతి బరిలో లోకేష్ ని దించాలనుకున్నాడట

February 04, 2015 | 03:45 PM | 34 Views
ప్రింట్ కామెంట్

పార్టీ పునాదులు రోజురోజుకీ క్షీణించిపోతున్నా కనీసం విమర్శల ద్వారా అయిన కాంగ్రెస్ ను వార్తల్లో నిలపాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అనుకుంటున్నారేమో. రోజుకో కొత్త కొత్త విమర్శలతో మీడియా ముందు వాలిపోతున్నారు. ఇప్పుడు ఆయనో కొత్త వింత వాదనను మీముందుకు తెచ్చాడులేండీ. అదేంటంటే... తిరుపతి ఉపఎన్నికల బరిలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ను దించాలని భావించాడట. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను బాబు విరమించుకున్నారట. చివరకు దివంగత వెంకటరమణ భార్య అయితే సెంటిమెంట్ తో గెలిచే అవకాశం ఉందని భావించి ఆమెనే ప్రతిపాదించారని రఘువీరా చెబుతున్నారు. ఏ పార్టీ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆయన భార్యనో, వారసులనో నిలబెట్టడం పరిపాటి. మరీ చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలీక కొడుకును నిలబెట్టాలని అనుకుంటాడా? ఆ విషయం రఘువీరాకే తెలియాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ