జనసందోహాం నడుమ ఢిల్లీ పీఠంపై ఏకే-46

February 14, 2015 | 01:11 PM | 22 Views
ప్రింట్ కామెంట్
Aravind_kejriwal_sworn_as_CM_second_time_niharonline

కిక్కిరిన జనసందోహాం మధ్య ఢిల్లీ రామ్ లీలా మైదానం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పట్టాభిషేకానికి వేదికైంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 8వ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చే ప్రమాణ చేయించారు. అటు తర్వాత ఆయన సన్నిహితుడు, కీలక నేత మనీష్ సిసోడియా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు బాధ్యతలు స్వీకరించిన వారిలో సందీప్ కుమార్(శిశు సంక్షేమం), సత్యేంద్ర జైన్ (వైదయ ఆరోగ్యం), గోపాల్ రాయ్ (రవాణా, కార్మిక శాఖలు). జితేంద్ర సింగ్ తోమార్(న్యాయ శాఖ), అసీం అహ్మద్ ఖాన్లు ప్రమాణం చేశారు. 46 ఏళ్ల కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కావటం ఇది రెండోసారి. గతేడాది ఇదే రోజున ఆయన లోక్ పాల్ కోసం రాజీనామా చేయటం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ