సింప్లిసిటితో టచ్ చేస్తున్న సామాన్యుడు

February 14, 2015 | 11:45 AM | 24 Views
ప్రింట్ కామెంట్
KEJRIWAL_OATH_TAKING_NIHARONLINE

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. రాంలీలా మైదాన్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం తెలపటంతో ఆప్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. సుమారు 40 వేల మంది కూర్చునేలా కుర్చీలు వేయించారు. అయితే ఇక్కడో వింతేంటంటే ముఖ్య నేతలు, వీఐపీలతోసహా ఎవరికీ రిజర్వ్డ్ సీట్లు కేటాయించక పోవటం. ఇక ఈ సామాన్యుడి పార్టీ ఆచరణ ఎంతలా ఉందంటే... చివరికి ఆయన భార్య, కుటుంబసభ్యులు అయినా సరే సీటు కోసం వెతుకోవాల్సిందే. మరోపక్క సుమారుగా లక్షన్నర మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. నేరుగా వీక్షించేందుకు వీలు లేకపోవటంతో వారికోసం 21 ఎల్ సీ డీ స్క్రీన్ లు ఏర్పాటుచేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాణాస్వీకారానికి హడావుడి లేకుండా సింప్లిసిటీ టచ్ ఇచ్చి తానేంటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ