కేంద్ర సాయం ఏ మూలకూ సరిపోదన్న మినిస్టర్

February 06, 2015 | 01:22 PM | 14 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ప్రకటించిన సాయంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోకగజపతి రాజు పెదవి విరిచారు. ఏపీ కి కేంద్రం నిధులు ఏ మూలన సరిపోవని ఆయన తన అసంత్రుప్తి వెళ్లగక్కారు. విజయనగరంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న రాష్ట్రానికి మరింత మేర నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై వస్తున్న గాలి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టి, తక్షణమే ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ