ఎలగెలగా? ఆప్ విజయానికి మోదీ కారణమా!

February 13, 2015 | 12:41 PM | 18 Views
ప్రింట్ కామెంట్
PM_Modi_broom_lost_delhi_poll_niharonline

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి అక్కడి బీజేపీ నేతలు కొత్త కారణాలను చూపిస్తున్నారు. నిన్నటి దాకా పరాజయానికి కారణమంటూ కిరణ్ బేడీ పై నిందలు వేసిన వారు తాజాగా ఈ మ్యాటర్ లోకి ఏకంగా ప్రధాని మోదీనే లాగుతున్నారు. ఇంతకి వారు చెబుతున్నదేంటంటే... గత సంవత్సరం అక్టోబర్ 2 గాంధీజయంతి రోజున మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ్ భారత్ ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన చీపురు పట్టిన చిత్రాలు నిత్యం ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు దేశ వ్యాప్తంగా పలువురిని ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వాములను చేసిన విషయం కూడా తెలుసుకదా. దీంతో ప్రతిరోజూ చీపురు గుర్తు ప్రసార మాధ్యమాలలో కనిపిస్తూనే ఉంది. అందుకే వేలాది మంది నిరక్షరాస్యులు కమలం గుర్తు మరిచి చీపురుకు ఓటేశారట. ఈ విధంగా ఓటమి మోదీ కూడా కారణమని వారు చెబుతున్నారు. చోద్యం కాకపోతే వారు మరీనూ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ