ఎంత ప్రేమో! బ్యాంక్ వద్దన్నా బాబు చేశారట

February 11, 2015 | 04:12 PM | 27 Views
ప్రింట్ కామెంట్
babu_said_about_loan_waive_niharonline

రైతు రుణమాఫీ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా చొరవ చూపిందంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రుణమాఫీకి కేంద్రం తొడ్పాటు అందించలేదని, రిజర్వ్ బ్యాంక్ కూడా అంగీకరించలేదని ఆయన తెలిపారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామని స్ఫష్టంచేశారు. రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. ఇదే పద్ధతిలో డ్వాక్రా సంఘాల రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటున్నాయని... కానీ, మరుగుదొడ్లు లేకపోవటమే విచిత్రంగా ఉందని అన్నారు. వందరోజుల్లో లక్ష మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీనిచ్చారట. ఇక ఈ హామీలన్ని వింటున్న అక్కడి రైతులకు సీఎం సారుకు మనమీద ఎంత ప్రేమో అని అనుకున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ