రైల్వే బడ్జెట్-2016: అందరికీ నచ్చేవి కొన్ని!

February 25, 2016 | 03:33 PM | 2 Views
ప్రింట్ కామెంట్
railyway-budget-2016-17-intresting-things-niharonline

మోదీ హయాంలో మరోసారి చుక్ చుక్ బండి వచ్చేసింది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు  లోక్ సభలో గురువారం  2016-17 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.  రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా సురేశ్ ప్రభు పేర్కొన్నారు. సామాన్య జీవితంపై భారం లేకుండా ఛార్జీలు పెంచకపోవటం పెద్ద ఊరట. పెద్ద దాదాపు గంటకు పైగా పార్లమెంటులో ప్రసంగించి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి అవి...

* చిన్నారుల కోసం ఆహారం, వేడి నీళ్లు : ప్రయాణాల్లో తల్లులు పడే బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఇక పాల బాటిల్ కడిగేందుకు వేడి నీరు లభించక పడ్డ ఇబ్బందులు అందరు తండ్రులకూ అనుభవమే. వీటి నుంచి విముక్తి లభిస్తుంది.

* వయోవృద్ధులకు లోయర్ బెర్తులు : వీటివల్ల సీనియర్ సిటిజన్లు పైన ఉండే బెర్తులకు వెళ్లేందుకు ఇక అవస్థలు పడక్కర్లేదు.

* 139 నంబరు ద్వారా టికెట్ రద్దు : టికెట్ల రద్దు కోసం వెళ్లి, బుకింగ్ కోసం వచ్చే వారితో సమానంగా క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచునే అగత్యం తప్పుతుంది.

* ఎస్ఎంఎస్ చేస్తే బోగీ శుభ్రం : రైలు బోగీల్లో గంట గంటకూ పెరిగే చెత్తను శుభ్రం చేయించుకునేందుకు ఇకపై ఒక్క ఎస్ఎంఎస్ ఇస్తే సరిపోతుంది. ఎటొచ్చీ ఈ సేవలు ఎప్పటి నుంచీ మొదలవుతాయన్నదే తెలియని విషయం.

* రైలు ప్రయాణికులకు స్థానిక ఆహారం : ఈ నిర్ణయం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నా ఆహారం విషయంలో బాధ పడాల్సిన అవసరం రాబోదు.

ఇవేగాక ఆన్ లైన్ లోనే రైల్వే నియామకాలు, ఫారెన్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ-టికెట్ కొనుగోలు సౌకర్యం, రైళ్లలో 30వేల బయో టాయిలెట్స్, టిక్కెట్ బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ వర్తింపు, సెకెండ్ క్లాస్ ప్రయాణినికీ దుప్పట్లు, దిండ్లు వంటి అంశాలకు చోటు కల్పించారు.

అయితే తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్రం ఈ దఫా కూడా హ్యండిచ్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‑ ఏర్పాటుపై మరోసారి నిరాశే ఎదురైంది. ఇక కాజీపేట కోచ్ అంశం ఎక్కడా ప్రస్తావించని కేంద్రం. యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగింపులో మొండిచేయి ఇచ్చింది. ఇక పెద్ద దెబ్బ ఏంటంటే... విశాఖ రైల్వే జోన్ ను అస్సలు పట్టించుకోకపోవటం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ