పనామా పేల్చిన బాంబులో ఇండియన్ సెలబ్రిటీలు!

April 04, 2016 | 11:49 AM | 1 Views
ప్రింట్ కామెంట్
panama-leaked-indian-celebrities-names-niharonline

పన్ను ఎగవేతతోపాటు, నల్ల కుబేరుల జాబితాకు సంబంధించి 500 మంది భారతీయు ప్రముఖుల పేర్లు వెల్లడికావటం సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 40 సంవత్సరాలకు చెందిన 1.15 కోట్ల పత్రాలను పరిశీలించిన అనంతరం జర్మనీ పత్రిక 'సుడియుషె జీతంగ్' 'పనామా పేపర్స్' పేరిట పలువురు బడా బాబుల పేర్లు వెల్లడించింది. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లతో పాటు డీఎల్ఎఫ్ యజమాని కేపీ సింగ్, ఆయన 9 మంది కుటుంబ సభ్యులు, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు వినోద్ అదానీ, అపోలో టైర్స్, ఇండియా బుల్స్ ప్రమోటర్ల పేర్లు కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ నాయకుడు శిశిర్ బజోరియా, లోక్ సత్తా ఢిల్లీ విభాగం మాజీ చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్, ముంబై గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చి (ప్రస్తుతం మరణించాడు)లు ఉన్నారు.

                             ఐశ్వర్య రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్ లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్ లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది. అమితాబ్ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారని ఈ కంపెనీలు 5 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది.

ఇండియాలో జరిగే ఎన్నో క్రికెట్ డీల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆర్బీఐ నిబంధనలు ఇందుకు సహకరిస్తున్నాయని 'పనామా పేపర్స్' అభిప్రాయపడింది. కాగా, 76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టుల బృందం 'పనామా పేపర్స్' ప్రాజెక్టులో భాగస్వామ్యమై ప్రపంచ వ్యాప్తంగా నల్లధనం దాచుకున్న వారి వివరాలను వెల్లడించే దిశగా పరిశోధనలు సాగించగా, ఇప్పుడా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ టీమ్ లో ఇండియాలోని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రిక భాగమైంది. ఆ పత్రికకు చెందిన సుమారు 25 మంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు నల్లజాబితాను అందించటంలో 'పనామా పేపర్స్'కు సహకరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ