జనగణమనను వద్దని లాజిక్ చెబుతున్నాడు

February 22, 2016 | 11:07 AM | 3 Views
ప్రింట్ కామెంట్
gopal-das-neeraj-jana-gana-mana-niharonline

జాతీయ గీతంగా దేశం మొత్తం ఆలపిస్తూ, గౌరవిస్తున్న జనగణమన పై ఓ ప్రముఖ హిందీ కవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ అసలు ‘జనగణమన’ కు జాతీయ గీతంగా హోదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో మీడియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

జనగణమన ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదేనని వ్యాఖ్యానించిన ఆయన, ఈ కారణంగానే ఆ గీతానికి జాతీయ గీతం హోదాను రద్దు చేయాలని పేర్కొన్నారు. ‘‘మనందరం బానిసలుగా ఉన్నాం. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్ కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు. బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ, ఇప్పటికీ కొంతమంది ఇంగ్లీష్ కి బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు. . ‘జనగణమన’ గీతంలో ‘అధినాయక’ అంటే నియంత, ‘జయహే భారత భాగ్య విధాత’ అంటే, దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ సింధు గుజరాత మరాఠా’లో సింధ్ ఇప్పుడు భారత్ లో ఉందా?’’ అంటూ ఆయన లాజిక్ లు తీశారు.

మరి  జనగణమనను జాతీయ గీతంగా రద్దు చేస్తే, దాని స్థానంలో ఏ గీతాన్ని ఎంపిక చేయాలన్న విషయాన్ని కూడా ఆయనే ప్రస్తావించారు. ‘వందేమాతరం’, 'ఝండా ఊంచా రహే హమారా’ గీతాల్లో దేనినైనా జాతీయ గీతంగా ప్రకటించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. అసలు వందేమాతరం గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం? వందేమాతర నినాదంతో ఎంతోమంది హిందువులు, ముస్లింలు అమరులయ్యారు అంటూ సుదీర్ఘంగా ప్రసంగించారాయన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ