ముగ్గురు మొనగాళ్ల మాటల్ని జనాలు అస్సలు నమ్మరంట

February 23, 2015 | 01:11 PM | 51 Views
ప్రింట్ కామెంట్
ktr_fire_on_ponnala_niharonline

తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ లో ఉన్న ముగ్గురు మొనగాళ్లు ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి చెప్పే విషయాలను జనాలు నమ్మరు సరికదా పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఒక తల్లిలా కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం డబ్బులు తీసుకుని పని చేసే నర్సులా వ్యవహారిస్తుందంటూ ఆయన అభివర్ణించారు. పలు సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు నిజామాబాద్ లో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆరునెలల్లో 60 ఏళ్ల దరిద్రం అంతమైపోదని, సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారని వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ