కంటతడిపెట్టిన కిరణ్ బేడీ... కారాలు నూరిన కేజ్రీవాల్

February 04, 2015 | 01:07 PM | 31 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీల మధ్య మాటల పంచ్ లు ఓరేంజ్ లో పేలుతున్నాయి. విరాళాల సేకరణపై విరుచుకుపడిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా బుధవారం కూడా బీజేపీ అసత్య ఆరోపణలపై ఊగిపోయారు. విచారణ చేపట్టి అందులో దోషిగా తేలితే అరెస్ట్ చేయండంటూ సవాల్ విసురుతున్నాడు. దీనిపై కిరణ్ బేడీ స్పందిస్తూ... అరెస్ట్ పేరిట ప్రజల సానుభూతిని సంపాదించుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా, పోటీచేయబోయే క్రుష్ణానగర్ లో బుధవారం ఆమె ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొటెత్తిన జనసందోహాన్ని చూసి ఉద్వేగంతో ఆమె కంటతడిపెట్టారు. మరోవైపు ఆమె ఓడిపోతుందనే బాధతోనే కంటతడిపెట్టిందంటూ ఆప్ సెటైర్ వేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ