కేటీఆర్ ప్రారంభించిన ఫ్లాంట్ లో అరాచకాలు

May 09, 2016 | 05:47 PM | 2 Views
ప్రింట్ కామెంట్
harassed-employees-protest-Micromax-manufacture-showroom-in-telangana

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రారంభించిన ఓ మొబైల్ ఫ్లాంట్ లో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి రావటం కలకలం రేపుతోంది. దాదాపు నెల రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరం మండలం తుక్కుగూడలో మైక్రోమ్యాక్స్ మొబైల్ తయారీ కేంద్రం ప్రారంభమైంది. దీనికి కేటీఆర్, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి  స్వయంగా హాజరై దీనిని ప్రారంభించి ఉద్యోగులతో పిచ్చపాటి సమావేశమయ్యారు. తొలుత 700 మంది ఉద్యోగులతో ప్రారంభించిన ఈ కంపెనీ మరో రెండు నెలలో ఇంకో 300 ఉద్యోగాలు కల్పిస్తుందని కేటీఆర్ ప్రకటించారు కూడా.

                                    అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితి మరోలా ఉంది. మొబైల్ తయారీ కేంద్రంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు ఆఫర్ లెటర్లలో ఇచ్చిన విధంగా చెల్లించడం లేదని, తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. భోజనంలో సున్నం కలుపుతున్నారని విమర్శించిన ఉద్యోగులు, యాజమాన్యం బలవంత పెట్టి మరీ, రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటోందని, వచ్చి పోయేటప్పుడు తనిఖీల పేరిట వేధిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ