సుప్రీంలో తీస్తా దంపతులకు ఊరట

February 19, 2015 | 03:56 PM | 25 Views
ప్రింట్ కామెంట్
teesta_javed_niharonline

సాంఘిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ మరియు ఆమె భర్త జావెద్ ఆనంద్ ను అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. గుజరాత్ అల్లర్ల సమయంలో బాధితుల పునరావాసం కోసం నిధులను సేకరించి, వాటిని దుర్వినియోగం చేశారని గుజరాత్ ప్రభుత్వ ఆరోపణలతో వీరిపై కేసు నమోదైంది. ఇప్పటికే వీరిరువురు బెయిల్ పై బయట ఉన్నారు. విచారణలో భాగంగా సుప్రీం బెయిల్ ను పొడగిస్తూ ఈమేరకు ఆదేశాలు వెలువరించింది. గుజరాత్ పోలీసులకు దస్ర్తాలు, విరాళాల వివరాలు అందజేయాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని పోలీసులతో ఉన్నతన్యాయస్థానం పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ