మోకాళ్ల మీద నడిచినా అధికారం ‘చేతి’కి రాదు

February 07, 2015 | 02:48 PM | 26 Views
ప్రింట్ కామెంట్
ktr_fire_on_PCC_chief_Ponnala_niharonline

సర్కార్ నిర్ణయాలపై తరుచు విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కే.తారకరామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ పొన్నాల పాదయాత్ర చేసినా, మోకాళ్ల మీద యాత్ర చేసినా అధికారంలోకి రావటం కల్ల అని వ్యాఖ్యానించాడు. పొన్నాల ఇప్పటిదాకా ట్రయిలరే చూశాడు. అసలు సినిమా ముందుంది అని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఓ కళేబరంలా తయారయ్యిందని ఆయన వ్యాఖ్యానించాడు. సచివాలయం తరలింపు వెనుక నిర్ధిష్ట ప్రణాళికతో ఉన్నామని, అనవసరంగా రాజకీయం చేయోద్దని ఆయన కోరారు. పాలనా సౌలభ్యం కోరకే దానిని తరలిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలు అధికారం చేజారిన ఆరు నెలలకే ఆగమాగం అవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ