అది భరోసా యాత్ర కాదు, మనుగడ యాత్రే

February 18, 2015 | 02:39 PM | 34 Views
ప్రింట్ కామెంట్
payyavula_keshav_fire_on_jagan_niharonline

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మరోమారు విరుచుకుపడ్డారు. కేసుల్లో ఇరుకున్న తనను తాను రక్షించుకునేందుకే జగన్ యాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ చేసేది భరోసా యాత్ర కాదు... మనుగడ యాత్ర అని ఎద్దేవాచేశారు. ఎన్నికల్లో ఓటమి, నానాటికీ క్షీణించిపోతున్న పార్టీని రక్షించుకునేందుకే ఈ మనుగడ యాత్రను జగన్ చేపడుతున్నారని ఆయన అన్నారు. జగన్ యాత్ర పట్ల ప్రజలు కూడా విశ్వాసం కోల్పోయారని కేశవ చెప్పారు. కబ్జాలలో లక్షలాది ఎకరాలు కొల్పోయిన బయ్యారం, సోంపేట బాధితులను పరామర్శించే దమ్ము జగన్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ