తెలీకుండా అడుగుపెడితే... తాటతీస్తానన్న తాటికొండ

February 09, 2015 | 04:30 PM | 22 Views
ప్రింట్ కామెంట్
rajaiah_warning_co_leaders_niharonline

తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఒక్కసారిగా ఫైరయ్యారు. తనకు తెలియకుండా ఏ నాయకుడైనా నియోజకవర్గంలో అడుగుపెడితే ఊరుకోనని వివాదాస్పదంగా మాట్లాడారు. తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమైనా నియోజకవర్గ ఇన్ ఛార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే జరగాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానని ఈ సందర్భంగా మరోసారి ఆయన చెప్పారు. ఓవైపు తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారంటూనే... మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని రాజయ్య పేర్కొనటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ