ఏపీకి వారిద్దరు ఏం చేశారో చెప్పాలన్న కాంగ్ నేత

February 09, 2015 | 03:18 PM | 15 Views
ప్రింట్ కామెంట్
ramachandraiah_blames_venkaiah_niharonline

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై కాంగ్రెస్ నేత సీ.రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. విభజన బిల్లులోవి తప్ప అదనంగా వెంకయ్యనాయుడు ఏపీకి ఏమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. వ్యంగ్యం. వాక్ చాతుర్యంతో వాస్తవాలను మరుగుపర్చాలని వెంకయ్య చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్త మాటలు కాదని, రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ఆయన వెంకయ్యకు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అభివ్రుద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరాడు. విభజన బిల్లులో అసమానతలు ఉన్నాయన్న చంద్రబాబు అప్పుడే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ లో చర్చ జరిగినప్పుడు కూడా బాబు పాల్గొనలేదని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ