ఆనాడు ఎన్టీఆర్ ను దించింది కూడా ప్రజలకోసమేనట

February 06, 2015 | 05:21 PM | 28 Views
ప్రింట్ కామెంట్

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉండి, పదవులు అనుభవించి ఇటీవలె కారెక్కిన సీనియర్ నేత తుమ్మల పార్టీ మారటంపై వివరణలు ఇస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ మనుగడ కష్టంగా మారిందని అందుకే తాను టీడీపీ ని వీడి టీఆర్ఎస్ లో చేరానని ఆయన చెబుతున్నారు. ఎప్పుడు అడిగినా చెప్పే ఓ మాటకు ముందకు ఇప్పుడు ఇప్పుడు సరికొత్తగా మరోమాటను చేర్చారు. అదేంటంటే ఆనాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి తప్పించినా, ఈనాడు టీఆర్ఎస్ లో చేరినా అది ప్రజల కోసమే అంటూ సరికొత్త భాష్యం చెప్పారు. కార్యకర్తలంతా అంగీకరించడంతోనే ఆయన పార్టీ మారారట. ప్రజల కోసం నమ్మి రాజకీయ జీవితాన్నిచ్చిన వ్యక్తికి కూడా వెన్నుపోటు పొడించేందుకు వెనకాడని తుమ్మల వంటి గొప్ప నేతలు ఇంకా ఎంతమంది ఉన్నారో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ