బొబ్బిలి రాజావారు ఆడుకుంటున్నారా?

April 16, 2016 | 11:33 AM | 2 Views
ప్రింట్ కామెంట్
sujay-ranga-rao-TDP-join-muhurtham-fix-niharonline

విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే, వైసీపీ నేత సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరిక మరోమారు వాయిదా పడింది. రెండు రోజుల క్రితం సుజయ టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. శుక్రవారమే తన సోదరుడు బేబి నాయన(వైసీపీ జిల్లా అధ్యక్షుడు) తో కలిసి బేబి నాయనతో కలిసి టీడీపీలో చేరతారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఈ నెల 18న ఆయన టీడీపీలో చేరుతున్నట్లు మళ్లీ వార్తలు వినిపించాయి.

                    అయితే ఆ రోజు కూడా సుజయ టీడీపీలో చేరడం లేదట. ఆ ముహుర్తం మరో రెండు రోజులు ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం సుజయ ఒక్కరే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పుట్టిన రోజైన ఈ నెల 20న సుజయ టీడీపీలో చేరిన తర్వాత మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలున్నట్లు సమాచారం. మరి రాజుగారు ఈ ముహుర్తానైనా ఖరారు చేసుకుంటారా లేదా చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ