పోసాని సినిమా ఎంత పని చేసింది

April 14, 2016 | 12:40 PM | 3 Views
ప్రింట్ కామెంట్
gudivada-andhra-bank-cheat-aqua-niharonline

అప్పుడెప్పుడో ఓ ఏడేళ్ల క్రితం పోసాని దర్శకత్వంలో వచ్చిన 'రాజావారి చేపల చెరువు' సినిమా గుర్తుందా? వర్తమాన రాజకీయాలపై సెటైరిక్ గా వచ్చిందా సినిమా. సరిగ్గా ఎలక్షన్ల సమయంలోనే అప్పటి రాజకీయాలను, నేతల జీవితాలను ఎండగడుతు తనదైన శైలిలో పోసాని తీశారా సినిమా. అందులో సెకండాఫ్ లో లేని చేపల చెరువును ఉన్నట్టు చూపించి బ్యాంకుల నుంచి రుణాలు ఎలా పొందారన్నది ప్రధానాంశంగా ఉంటుంది. అదే తీరును గుర్తు చేస్తూ, కృష్ణా జిల్లా లో ఓ సంఘటన జరిగింది.

                   గుడివాడ ఆంధ్రాబ్యాంకులో దాదాపు రూ. 3.3 కోట్ల విలువైన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చేపల చెరువులను లీజుకు తీసుకున్నామని నకిలీ పత్రాలు సృష్టించిన ఏడుగురు వ్యక్తులు బ్యాంకుల నుంచి రూ. 3.3 కోట్ల రుణం పొందగా, అదిప్పుడు వడ్డీతో కలిపి రూ. 4.79 కోట్లకు పెరిగింది. రుణ బకాయిల వసూలుకు వెళ్లగా, అవి తప్పుడు చిరునామాలని, అసలు వారు చెప్పిన ప్రాంతంలో చెరువులే లేవని తేలాయి. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

                     రుణం తీసుకున్న మడ సుబ్రమణ్యం, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, నాగరాజు, పోలారయ్య, తాండ్ర జ్యోతి, అంజనీదేవిలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రుణమిచ్చిన అధికారులు చెరువులు ఉన్నాయా? వీరి చిరునామాలు సరైనవేనా? పత్రాలన్నీ కరెక్టేనా? అన్న విషయాలు పరిశీలించకుండా రుణం ఇచ్చేయడం వెనుక అసలు విషయం బయటకు తీసేందుకు ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మధ్యే ప్రభుత్వ భూమిని తనదని తాకట్టుపెట్టి ఓ వ్యక్తి ఇదే బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుని బ్యాంక్ కి కుచ్చు టోపీ పెట్టిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ