చివరికి... ఎంసెట్ ను ఏపీ విడిగానే నిర్వహిస్తుందట

February 02, 2015 | 04:56 PM | 18 Views
ప్రింట్ కామెంట్

ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఎంసెట్ వివాదం తెలిసిందే. ఎంతలా అంటే ఆఖరికి గవర్నర్ ఆదేశాలను బేఖాతరు చేసేంతలా. ఇక ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఎంసెట్ ను విడిగా నిర్వహించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఉమ్మడి నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఒప్పుకోకపోవటంతో చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సోమవారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి వర్గం ఈ విషయమై తీవ్రంగా చర్చించారు. చివరకు పలు కీలకాంశాలతోపాటు ఈ ఎంసెట్ అంశానికి చెక్ పెట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ