బాలయ్య కేసీఆర్ ను ఎందుకు కలిశాడు?

April 20, 2016 | 05:21 PM | 1 Views
ప్రింట్ కామెంట్
KCR_balakrishna_krish_invitation_niharonline

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. బుధవారం టీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఇంతకు ముందు బసవతారకం ఆస్పత్రికి సంబంధించి పలు అనుమతుల కోసం వీరిద్దరు కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ముహుర్తం షాట్ హాజరు కావాల్సిందిగా కేసీఆర్ కు బాలయ్య ఆహ్వాన పత్రం అందించారు. కాగా అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కావటం, పైగా వందో చిత్రం కావటంతో రాజకీయ, సినీ ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు బాలయ్య ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను బాలయ్య ఆహ్వానించారు. ఆయనతో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడు.

               క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమి టైటిట్ ను ఉగాదిరోజున అమరావతిలో ప్రకటించగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ జరుపుకుంటున్న ఈ సినిమా 22న పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ