బేడీ ఓ నియంత: బీజేపీని వీడిన ఎన్నికల సారథి

February 02, 2015 | 12:33 PM | 23 Views
ప్రింట్ కామెంట్

మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా, బీజేపీ కి అనుకోని షాక్ ఎదురయ్యింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు బీజేపీలోకి వలసలు వెళుతుంటే, ఆ పార్టీ కీలక నేత నరేంద్ర టాండన్ మాత్రం రాజీనామా చేశారు. సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఎన్నికల ప్రచార ఇంఛార్జిగా టాండన్ వ్యవహరిస్తున్నారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ అమిత్ షాకు పంపినట్లు సమాచారం. అందులో కిరణ్ బేడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారని తెలుస్తోంది. అంతేకాదు కిరణ్ బేడీ సన్నిహితులు కూడా ఆయనను అవమానించారని ఆయన లేఖలో వాపోయాడట. అయితే కిరణ్ బేడీపై అసంత్రుప్తితో ఉన్న మరికొందరు నేతలు ఆయన బాటలో పార్టీని వీడే ప్రమాదం ఉందని కమలనాథుల్లో గుబులు మొదలైందట. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉండటంతో ఇది పార్టీకి కాస్త ఇరకాటంలో పడేసేది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ